తాటిపాకలో భక్తుల కోలాహలం

73చూసినవారు
రాజోలు మండలం తాటిపాకలోని ప్రధాన కూడలిలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం కోలాహలం నెలకొంది. వినాయక చవితి పూజ సామగ్రిని విక్రయించేందుకు భారీగా షాపులు ఏర్పాటు చేశారు. ప్రధాన వాణిజ్య కూడలి కావడంతో భక్తులు పూజా సామగ్రి కొనుక్కునేందుకు భారీగా తరలివచ్చారు. భక్తుల సందడితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్