భారీగా ఇసుక అక్రమ రవాణా

83చూసినవారు
అవనిగడ్డ మండల పరిధిలోని దక్షిణ చిరువోలు లంక గ్రామంలో భారీగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. వరదలు వచ్చి తగ్గిపోయిన తర్వాత కృష్ణా నది వద్ద భారీగా యంత్రాలను ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో బయట ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. మామూలుగా ఇసుక దొరికేటప్పుడు రూ. 700లు వసూలు చేసే ట్రాక్టర్ యజమానులు ఇప్పుడు వెయ్యి రూపాయలు పైనే వసూలు చేస్తున్నారని ప్రజలు బుధవారం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్