ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు: ఎమ్మెల్యే

80చూసినవారు
ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు: ఎమ్మెల్యే
కృష్ణానదికి చరిత్రలో ఎరుగని స్థాయిలో వచ్చిన వరద ముప్పును కూటమి నాయకులు, అధికారులు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డ గాంధీక్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా శ్రమించిన కూటమి నాయకులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ ప్రశంసించి ప్రశంసాపత్రాలు బహుకరించారు.

సంబంధిత పోస్ట్