
మచిలీపట్నం: మంగనపూడి బీచ్ అభివృద్ధికి ప్రణాళిక
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ బాలాజీలతో కలిసి బీచ్ ను పరిశీలించారు. ఆహ్లాదకర వాతావరణ గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.