ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

4227చూసినవారు
కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యల ఫీడ్ వెళ్తున్న కంటైనర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్, శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొంది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా గాయపడిన మరో ఐదుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు, మూడు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్