ఆపదలో ఉన్నవారికి అన్నదానం చేయటం మహా భాగ్యంగా భావించాలని కంకిపాడు తహసిల్దార్ బావన్నారాయణ పేర్కొన్నారు. శనివారం కంకిపాడు మండలం తెన్నేరులోని పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులకు అంగనవాడీ కార్యకర్తల వితరణతో ఆహారంను తహశీల్దార్ భావన్నారాయణ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జుజ్జువరపు ఎలీషా, అంగనవాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.