

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలుచోట్ల ఎండల తీవ్రత పెరిగి వడగాల్పులు వీస్తున్నాయి. గురువారం ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బాపులపాడు 36°, గన్నవరం 37°, బందరు 34°, పెనమలూరు 40°, పామర్రు 33°, అవనిగడ్డ 32°, పెడన 34°, ఉయ్యూరు 37° నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెప్పారు.