పెంటేలవారిగూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం

936చూసినవారు
పెంటేలవారిగూడెం లో ఉచిత పశు వైద్య శిబిరం
వత్సవాయి మండలం పెంటేలవారిగూడెం గ్రామంలో బుధవారం పశు సంవర్థక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువైద్యులు డా. శ్రీనివాస్ నాయక్ పాడి పశువులకు చూడి పరీక్షలు, కృత్రిమ గర్భధారణ, పొదుగువాపు, తదితర సమస్యలకు వైద్యంచేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని ఎటువంటి సమస్యను గమనించినా వెంటనే దగ్గరలోని పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్