మండవల్లి: అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

51చూసినవారు
మండవల్లి: అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
మండవల్లి మండలం చావలిపాడు గాంధీనగర్ లో కులం పేరుతో దూషించిన ఘటనపై నమోదైన అట్రాసిటీ కేసుపై డీఎస్పీ శ్రావణ్ కుమార్ గురువారం రాత్రి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన విసన్నపల్లి మేరీ, భర్త వెంకటేశ్వరరావును ఇంటి పక్కనున్న మహమ్మద్ అబ్దుల్ గఫార్, అతని కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించడంతో ఈనెల 8న కేసు నమోదైంది. దీనిపై క్షేత్రస్థాయిలో డీఎస్పీ బాధితులను విచారించి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్