మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్సీ
నందిగామ మండలంలోని లింగాలపాడు గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను శాసనమండలి సభ్యులు డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు, సేవా సమితి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.