నందిగామ పట్టణంలోని ఈద్గాలో సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే మంచి సందేశాలుని ఈద్గాలో మత గురువు పేర్కొన్నారు. దైవప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.