విజయవాడలో లోకో పైలట్ హత్య

63చూసినవారు
విజయవాడ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే బెజవాడ డివిజన్లో లోకో పైలట్ గా పని చేస్తున్న డి. ఎబినేజర్ ను ఓ అగాంతకుడు హత్య చేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు ఆన్ డ్యూటీ లో ఉన్న లోకో పైలెట్ శుక్రవారం తెల్లవారుజామున నైజాం గెట్ సమీపంలో విధి నిర్వహణలో భాగంగా.. రైల్వే రోడ్ నెంబర్ 11లో ఆయన వెళుతుండగా అకస్మాత్తుగా అతనిపై ఇనుప కడ్డీతో బలంగా తలపై మోదీ హత్య చేసి పరారయ్యాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్