రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆందోళన

77చూసినవారు
రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రైతులు ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు అంజినయ్య, సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ తదితరులు రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్