
రుద్రవరం: ఈనెల 26 నుంచి ఆధార్ నమోదు శిబిరాలు
రుద్రవరం మండలంలో ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆధార్ ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో భాగ్యలక్ష్మి సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 0-6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు కొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకున్నందుకు శ్రీరంగాపురం, కోటకొండ, మందలూరు, ఎర్రగుడిదిన్నె, గ్రామ పంచాయతీలలో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని, అన్ని గ్రామాల ప్రజలు ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.