సుప్రీంకోర్టులో మంగళవారం తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల కేసు విచారణ జరిపారు. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ప్రతివాదులు కోరారు. ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ప్రశ్నించింది. మీకు ఎంతసమయం కావాలి... MLAల పదవి కాలం ముగిసే వరకా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలన్న కోర్టు హెచ్చరికల జారీచేసింది.