కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

1054చూసినవారు
కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గతేడాది వర్షాలు లేక కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని దేవనకొండ మండల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపుమేరకు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరువు కాటకాలకు పెట్టిన పేరు కర్నూలు జిల్లా అని ఇంతవరకు ప్రభుత్వం కనీసం కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్