శ్రీచౌడేశ్వరిదేవికి సహస్ర దీపాలంకరణ సేవ

53చూసినవారు
బనగానపల్లె మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నందవరం శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెయ్యి దీపాలతో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్