టీడీపీ డోన్ సీటు తనకే ఇస్తానని ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు మాటపై నమ్మకం ఉందని ఆపార్టీ నియోజకవర్గ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ప్యాపిలీ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎవరు రాకపోవడంతో అధినేత తనను నియమించారన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.