టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాము

82చూసినవారు
టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాము
నంద్యాల ఎస్సార్ బీసీ కాలనీ , వైయస్ నగర్ లలో ఉన్న టిడ్కో ఇళ్లను నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వారి బృందంతో గురువారం పరిశీలించారు. తాగునీరు, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్‌ సదుపాయం, రోడ్లు వంటి అన్ని వసతులను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తామన్నారు. మాజీ కౌన్సిలర్ వాకా శివ శంకర్ యాదవ్ , కౌన్సిలర్ నాగార్జున , మామిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్