లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ మహిళ జర్నలిస్టుకు ఊహించని అనుభవం ఎదురైంది. మార్కెట్లో ఎద్దుల ధరలపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ రిపోర్టు చేస్తుండగా ఎద్దు దాడి చేసింది. దీంతో ఆమె కేకలు వేస్తూ అల్లంత దూరాన ఎగిరి పడింది. పక్కనే ఉన్న ఓ వ్యాపారి స్పందించి ఆమెకు సాయం అందించారు. పాకిస్థాన్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.