రాబోయే జనరల్ ఎలక్షన్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డిఎస్పీ శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో సీఐలు తేజ, గోపి, నరసింహారాజు ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో సెంట్రల్ ఫోర్స్ ఎస్ఎస్బి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వేసేందుకు భరోసా కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశ్యమని డిఎస్పి అన్నారు.