వెనుకబడిన పత్తికొండ అభివృద్ధికి సహకారం అందించాలి

75చూసినవారు
వెనుకబడిన పత్తికొండ అభివృద్ధికి సహకారం అందించాలి
పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీనీవా జలాలతో సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ కోరారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన మంత్రి రామానాయుడును ఎమ్మెల్యే శ్యాంబాబు కలిసి మాట్లాడారు. పత్తికొండ అత్యంత వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. గ్రావిటీ ద్వారా హంద్రీనీవా కాలువ నీటిని ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని వాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్