రంగాపురంలో వైసీపీ ఇంటింటి ప్రచారం
పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున బుధవారం వైసీపీ నేతలు డమ్మీ ఈవీఎం నమూనాతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలు నాగప్ప, బజారి, ఈరన్న ప్రతి ఇంటికి వెళ్లి ఈవీఎంలోని బాలనాగిరెడ్డి పేరుకు ఎదురుగా ఉన్న ఫ్యాన్ గుర్తుపై, అలాగే కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య పేరుకు ఎదురుగా ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.