Mar 27, 2024, 15:03 IST/శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి
కేటీఆర్ పై కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు
Mar 27, 2024, 15:03 IST
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1, ఏ2 ముద్దాయిలని బుధవారం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేసేవారని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్కి ప్రధాన కారణం వారిద్దరే అని. వారికీ జైలు శిక్ష పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విమర్శించారు.