ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో కొందరు యువకులు నడిరోడ్డుపైనే దారుణంగా కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. పూర్ణగిరి మందిర్ వెళ్లే భక్తులపై అక్కడున్న పండ్ల వ్యాపారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.