అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు రికార్డులు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలిసి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన గంటల ముందే ఇలాంటి ఘటన జరగడంతో పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి.