ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ల సమావేశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు 3 ప్రశ్నలు సంధించారు. "ఏపీలో కలిపిన ఏడు మండలాలను TG తిరిగి అడిగిందా? ఆంధ్రప్రదేశ్కు ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతంలో, వివిధ పోర్టుల్లో TG వాటా అడిగిందా? టీటీడీ ఆదాయంలోనూ, బోర్డులోను TG వాటా అడిగిందా? పై ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా?" అని ఎక్స్ వేదికగా అంబటి ప్రశ్నించారు.