తనను ఓడించడానికి వైసీపీ మంత్రి మిథున్ రెడ్డి పిఠాపురంలో తిష్ట వేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మిథున్ రెడ్డి స్పందిస్తూ.. "పిఠాపురంపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు." అని కౌంటర్ ఇచ్చారు.