ఢిల్లీ ఓటర్లకు శుభవార్త. మే 25న ఓటింగ్ వేళ పోలింగ్ బూత్ల నుంచి ఓటర్లు వారి ఇళ్లకు ఉచితంగా బైక్ ట్యాక్సీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ మేరకు ర్యాపిడో కంపెనీతో ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కేవారు తప్పకుండా తమ వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ను అందించి, ఉచిత రైడ్ను ప్రారంభించవచ్చు.