మంకీపాక్స్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

56చూసినవారు
మంకీపాక్స్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. ఇందులో అధునాతన పరికరాలన అందుబాటులో ఉంచింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఈ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్