రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు

78చూసినవారు
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు
ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరి అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, 2019 డిసెంబర్‌లో మస్తాన్ రావు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. తిరిగి ఇప్పుడు సొంత గూటికి చేరుతున్నారు.

సంబంధిత పోస్ట్