టీడీపీ అధినేత చంద్రబాబుపై కడప
వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి సీరియస్ అయ్యారు. పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవాడు ఎవడూ.. ఇలా చేయడని, చంద్రబాబుకు మెదడు కిందకు జారినట్లుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అవ్వతాతల ఉసురు చంద్రబాబుకు తగలకుండా పోదని దుయ్యబట్టారు.