కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనసేన అభిమానులు బూతులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం కంటే నన్ను, నా కుటుంబాన్ని చంపేయండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి. కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇప్పించాయి. ప్రత్యేక హోదాపై ఆయన ఆలోచించాలి.’ అని ముద్రగడ అన్నారు.