ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంలో ఊరట

69చూసినవారు
ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంలో ఊరట
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాస్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నమోదైన కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్