చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వృద్ధులకు ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు. "నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు. ఇప్పుడు ఎండల్లో అవస్థలు పడి 2 రోజుల్లో 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారు. 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును ఏమనాలి? 31 మందిని చంపిన బాబును హంతకుడు అందామా? ఇంతకంటే దారుణమైన పదంతో పిలుద్దామా?" అని సీఎం ప్రశ్నించారు.