AP: సీఎం చంద్రబాబుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. "ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబు నాయుడు." అని ఆమె పోస్ట్ చేశారు. "సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు గారు చేసిన తొలి సంతకం.. రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమానికి సంకేతం. ఇచ్చిన హామీ మేరకు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారు." పేర్కొంటూ భువనేశ్వరి మరో ట్వీట్ చేశారు.