ఎగువ అహోబిలంలో శ్రీవారికి చక్రస్నానం

75చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల అహోబి లంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామికి 108 కలశాలతో తిరుమంజనం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. భవనాసి గుండం వద్ద జ్వాలా నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్లకు చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అలసిపోయిన శ్రీ స్వామివారు చక్రస్నానంతో సేద తీరారు.

సంబంధిత పోస్ట్