21న భారత్ బంద్ ను జయప్రదం చేయండి

80చూసినవారు
21న భారత్ బంద్ ను జయప్రదం చేయండి
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 21వ తేదీన చేపట్టనున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మాల మహానాడు నాయకులు మల్లయ్య, ఎలీషా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో గల అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రం నందు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన చేపట్టబోవు భారత్ బంద్ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్