ఆత్మకూరులో పాక్షికంగా భారత్ బంద్

79చూసినవారు
ఆత్మకూరులో పాక్షికంగా భారత్ బంద్
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలమహానాడు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన భారత్ బంద్ ఆత్మకూరులో పాక్షికంగా జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఆ సంఘం నాయకులు మల్లయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు పునర్ పరిశీలించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్