ఎమ్మిగనూరులోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ నిర్వాహకులు బుట్టా ప్రతుల్ 40మంది విద్యార్థినులకు నోటు
పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బుట్టాఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థినులకు చేయుతనందిస్తున్నామన్నారు.