
ఎమ్మిగనూరు: మతోన్మాదం నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
76వ గణతంత్ర దినోత్సవం ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్, ఎన్టీఆర్ కాలనీలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ దేశంలో మతోన్మాదంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి చూస్తున్నారని ఇది సరైనది కాదని గుర్తు చేశారు. రాబోయే కాలంలో విద్యార్థులను, యువతీ యువకులను పెద్ద ఎత్తున చైతన్యం చేసి హక్కులు కల్పించేంత వరకు పోరాటం చేస్తామన్నారు.