వైసీపీ నేతలపై ఈసీకి నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు

2591చూసినవారు
వైసీపీ నేతలపై ఈసీకి నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు
విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంపై వైసీపీ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో తన పేరుపై ట్వీట్‌ చేయడాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తప్పుబట్టారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

సంబంధిత పోస్ట్