AP: తిరుపతి జిల్లా తడ మండలంలోని లింగాలపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో విద్యార్థులను సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.