రుషి కొండకు గుండు కొట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి : నారా లోకేష్

13334చూసినవారు
ఎన్నికల సమరభేరి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్నపుడు ఎక్కడ చూసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవ కార్యక్రమాలు కనపడ్డాయని అన్నారు. ఆయన సొంతో నిధులతో గ్రామాల్లో తాగు నీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు.

అనంతరం ప్రభాకర్ రెడ్డి మీద వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్ సాయి రెడ్డి మీద విరుచుకపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాల్లో ఏ2 విజయసాయి రెడ్డి అని విశాఖ పట్టణాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి, రుషి కొండకు గుండు కొట్టిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పొరపాటున అలాంటి వ్యక్తి గెలిస్తే మన ఇంటి పై ఉన్న కప్పు ను కూడా ఎత్తుకెళ్తారని అన్నారు. సౌమ్యుడు, మంచి ఆలోచనలతో, అహర్నిశలు కష్టపడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్