నెల్లూరు జిల్లా రాపూరు మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో ఈ నెల 19 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం నెల్లూరు ఆర్డీవో మలోల ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 16న పెంచల కోన ఆలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.