AP: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. తదుపరి ఉత్తర్వుల కోసం సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద రిపోర్టు చేయాలని.. ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు పి. శ్రీలేఖ, ఏ. మురళి, ఓ. రాంభూపాల్ రెడ్డిలకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు. బదిలీ అయిన వారి స్ధానంలో ఇతర అధికారులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.