నందిగామ పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన ఎలక్ట్రీషియన్ డే వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక
జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జెండాను ఎగురవేశారు.