ఓడినా వైసీపీ నేతల తీరు మారలేదు: గంటా

50చూసినవారు
ఓడినా వైసీపీ నేతల తీరు మారలేదు: గంటా
AP: ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకులు ఇంకా మారలేదని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. "భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే పనులు ఆపించాం. బాధ్యులైన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకున్నాం. నిజాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ నియమించాం. కానీ మీరేం చేశారు? అధికారంలో ఉన్న ఇన్ని నెలలు మొద్దు నిద్ర నటించారు" అని ఆయ‌న మండిప‌డ్డారు.

సంబంధిత పోస్ట్