పిడుగురాళ్ల పట్టణంలో అతిశారా వ్యాధి ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా డిఎంహెచ్ఒ డాక్టర్ బి రవి పిడుగురాళ్ల పట్టణంలోని 32 వ వార్డు లో ఉన్న ప్రభుత్వ హెల్త్ సెంటర్ ను శనివారం సందర్శించారు. వారితోపాటు డిప్యూటీ డిఎంహెచ్ ఒ హనుమ కుమార్, డాక్టర్ రవితేజ, ఆరోగ్య విస్తరణ అధికారి పట్టాభి, పట్టణ కమిషనర్ గిరికుమార్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.