జ్వర లక్షణాలు ఉన్నవారికి నిర్ధారణ పరీక్షలు: డీఎంఓ

63చూసినవారు
గ్రామాల్లో జ్వరం లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికీ సత్వరమే నిర్ధారణ పరీక్షలు క్షేత్ర స్థాయిలోనే జరపాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంఓ) డాక్టర్ టి. జగన్ మోహన్ రావు ఆదేశించారు. కొమరాడ మండలం లో చినఖేర్జల గ్రామాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. జ్వర లక్షణాలతో ఉన్న వారికి నిర్వహించిన మలేరియా ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు, ఫలితాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్